ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై సీ.బీ.ఐ. కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీ.డీ.యూ. మార్గ్లోని బీ.జే.పీ. ప్రధాన కార్యాలయం దగ్గర ఆప్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇదే పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గతంలో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ట్రయల్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఢిల్లీ హైకోర్టు బెయిల్పై స్టే విధించింది. బీ.జే.పీ. ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఆప్ కార్యాలయం వద్ద ఆందోళనకారులు సమావేశమై బీ.జే.పీ. కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేజ్రీవాల్ను విడుదల చేయాలని పిలుపునిచ్చారు.