ఇటీవలి అలీగఢ్ హత్య కేసులో బాధితుడు మహ్మద్ ఫరీద్ మెట్లపై నుంచి పడి గాయాలపాలై మరణించాడని నిందితుడి తల్లి ఆరోపించింది. అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో ఒకరైన రాహుల్ తల్లి లక్షీ మిట్టల్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఫరీద్ మరియు మరో ఎనిమిది మందిపై దోపిడీ ఆరోపణపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది.
జూన్ 18 రాత్రి ఫరీద్ అలియాస్ ఔరంగజేబ్ మా ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను దోచుకునే ముందు నన్ను వేధించడానికి ప్రయత్నించాడని తెలిపింది. నా కుటుంబ సభ్యులు అతనిని వెంబడించడంతో, అతను బ్యాలెన్స్ కోల్పోయాడు, మెట్లపై నుండి పడిపోయాడు. దానితో అతనికి గాయాలయ్యి మరణించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.