ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి తన ఇద్దరు భార్యలు దగ్గరుండి మూడవ పెళ్లి చేసారు. వివరాళ్లోకి వెళ్తే… పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరికి 2007లో ఒక బాబు పుట్టాడు. కాగా.. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు. దీనితో గ్రామంలో ఉన్నవారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఏపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది…
![ex](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/ex.jpg?resize=613%2C700&ssl=1)