అంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులు ఏ సమస్యను లేవనెత్తిన వెంట వెంటనే పరిష్కరిస్తున్న కూటమి పెద్దలకు ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రూప్-2 వాయిదా వేసినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, బీ.జే.పీ. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. త్వరలోనే గ్రూప్ వన్ 1:100 గా మరల ఫలితాలు విడుదల చేయాలని, ఉద్యోగ వయోపరిమితి 47 కు పెంచాలని తెలిపారు. 2023 జనవరి 22న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు వేసి న్యాయం చేయాలని హేమంత్ కోరారు.