ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా మంగళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. దసరా సందర్బంగా విజయవాడ లో ఉన్న కనకదుర్గమ్మ దర్శనార్ధమై వచ్ఛే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 5,500 బస్సు లను నడుపుతున్నామని తెలియజేసారు.
గత దసరా పండుగలో 50 శాతం ఛార్జీలు పెంచడం జరిగిందని, దానికి స్వస్తి పలికామని చెప్పారు. వచ్చీ పోయే ప్రయాణికులకు 10 శాతం రాయితీని కలిపించామన్నారు. రాయితీ లు కల్పించి ఓఆర్ ఆదాయ పేంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేసారు. మరొక 1,500 కొత్త డీజిల్ బస్సు లు కొనుగోలు చేస్తున్నామన్నారు.
ఈ సంవత్సరం వెయ్యి కొత్త ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలు చేశామని, ఇంకో మూడు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో కి వస్తాయని తెలియచేసారు. పీఎఫ్ బకాయిలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి, హయ్యర్ పెన్షన్ ఇచ్చెందుకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్బంగా డిపో ఆవరణలో మొక్కలు నాటారు.