జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ 10 రోజులు పాటు ఈ సెలవులు ఉంటాయన్నారు. అయితే పదవ తరగతి విద్యార్థులకు మాత్రం 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రోజుకు ఒక సబ్జెక్టు పై పఠన తరగతులు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి విద్యార్దులు ఈ తరగతుల్లో పాల్గొనాలని తెలిపారు. సెలవుల అనంతరం 25వ తేదీన తిరిగి పాటశాలలు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా ఎంఇవో శివరామ కృష్ణయ్య తెలిపారు.
14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…
![sch](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/sch.jpg?resize=1296%2C700&ssl=1)