అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామంలో వేదాంత క్లీన్ ఎనర్జీ సిఎస్ఆర్ నిధులైన రూ. 28.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 40,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ ట్యాంకును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మరియు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ లు ప్రారంభించారు. తద్వార ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుతగా నూతనంగా నిర్మించిన తాగునీటి సరఫరా ఓహెచ్ఎస్ఆర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు. తదుపరి అదే మండల పరిధిలోని కొమరగిరిపట్నం ఆర్ అండ్ బి రోడ్ నుండి జాంబవానిపేట ( వయా) ఉత్తగుంటసావరం వరకు పంచాయతీరాజ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్ నిధులైన రూ 70.53 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డును మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు ప్రారంభించారు.
అదేవిధంగా మండల పరిధిలోని కొమరగిరిపట్నంలో పంచాయితీరాజ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్ నిధులైన రూ.258.87 లక్షల అంచనా వ్యయంతో కొడప నుండి కొడపదిరి బ్రిడ్జి నిర్మాణoతో సహా నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్డును మంత్రి, శాసనమండలి సభ్యులు ప్రారంభించారు. అనంతరం అమలాపురం- బెండమూర్లంక ఆర్ అండ్ బి రోడ్డు నుండి రెబ్బనంపల్లి వయా వరద కట్ట మీదుగా పాలగుంట చెరువు వరకు పంచాయతీరాజ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 128.99 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డును ఆయన, శాసనమండలి సభ్యులు ప్రారంభిం చారు. అదేవిధంగా మొగళ్ళమూరు ఆర్ అండ్ బి రోడ్డు వయా జాంబవా నిపేట గురుకుల పాఠశాల ఎస్సీ ప్రాంతం వరకు పంచాయతీరాజ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్ నిధులైన సుమారు రూ 92.44 లక్షల అంచ నా వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్డును మంత్రి, శాసనమండలి సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, జడ్పిటిసి గౌతమి ఎంపీపీ శేషారావు కే బాపూజీ, సురేష్ వర్మ చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.