రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక స్థితితో పాటు ప్రజలకు నష్టం కలుగుతుందని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే ఎంతో సుందరమైన కాకినాడ నగరంలో నేడు గంజాయి, భూకబ్జా వంటి అక్రమాలకు వైకాపా పాలనలో కాకినాడ అడ్డాగా మారిందని చెప్పారు. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాకినాడ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో జనసేన – టీడీపీ కలిసి సంయుక్త ప్రచారం నిర్వహిస్తామని దీనిని ఇరు పార్టీలు సహకరించాలని కోరారు. జనసేనాని పవన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుందని జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యంగా విద్య, వైద్య వసతులు మెరుగుపడతాయని సుధీర్ చెప్పారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన పీ.ఎ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దారుణమైన పాలన ఉందని ఇక్కడ ఉన్న పాలకులు అభివృద్ధి చేయకపోగా కాకినాడను మురికివాడగా మార్చారన్నారు. అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా చెత్త పన్ను వేసి చెత్త కూడా తీయట్లేదన్నారు. 2024 రాష్ట్రంలో జనసేన- టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్తా శశిధర్, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, తుమ్మల బాబు, తదితరులు పాల్గొన్నారు.