రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా హుందాతనంతో మెలిగేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్తూపం వద్ద ఆయన పోలీస్ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పై మితిమీరిన రాజకీయ ఒత్తిడి కారణంగా సమాజంలో పోలీసుల పనితీరు పట్ల అవిశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే ప్రక్రియలో అసువులు బాసిన పోలీస్ అమరుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసుల విధి నిర్వహణ గతంతో పోల్చి చూస్తే నేడు ప్రజల్లో పోలీసులు పట్ల అభద్రత వాతావరణం నెలకొందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని ధిక్కరించి పెన్షనర్స్ పారడైజ్ గా భాశీలుతున్న కాకినాడ నగరంలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తుల ఆధ్వర్యంలో షాడో పోలీస్ స్టేషన్ నిర్వహించడం ప్రజల అనుమానాలకు, అభద్రతకు బలాన్ని చేకూరుస్తుందన్నారు. భవిష్యత్తులో పోలీస్ వ్యవస్థ పై పడ్డ మచ్చను చెరిపేందుకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు జనసేన పార్టీ అధికారంలోకి రానందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి శివ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ ఆట్ల సత్యనారాయణ, 39 వ డివిజన్ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాస్, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.