రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం పోర్టు తొలిదశను 2023 డిసెంబరు నాటికి పూర్తిచేయాలనే సంకల్పంతో పనులు జోరందుకున్నాయి. జూన్ 2022 లో నవయుగ, అరబిందో కంపెనీలు రూ.2,634.65 కోట్లతో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి రూ.3,736 కోట్ల వ్యయంతో 850.79 ఎకరాల విస్తీర్ణంలో 34.04 టన్నుల సామర్థ్యం కలిగిన పోర్టు తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు అనుసందానంగా ఈ పారిశ్రామిక పార్కును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా అభివృద్ది పనులు చేపడుతోంది. ఇప్పటికే 4,850 ఎకరాల స్థలంలో పారిశ్రామిక పార్కు పనులు చేపట్టిన విషయం తెలిసిందే.