విశాఖ నుండీ విజయవాడ మీదిగా రహస్యంగా రూ.100 కోట్లు హైదరాబాద్ కు తరలిస్తుండగా విశాఖ పోలీసులు పట్టుకున్నారు. వాషింగ్ మిషన్ను తరలిస్తున్నట్టు ఆటోలో రహస్యంగా నగదు రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. రంగంలోనికి దిగిన పోలీసులు ఆటోవాలాను అదుపులోనికి తీసుకున్నారు. ఆ వాషింగ్ మిషన్ సోనో విజన్ కంపెనీకి చెందినది కావటంతో ఆ దిశగా సంబంధిత యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు. అయితే వారు సరైన ఆధారాలు చేపలేకపోతున్నట్టు తెలుస్తుంది. వాషింగ్ మిషన్తో పాటు 30 సెల్ పోన్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నగదు మొత్తం ఒక పార్టీకి చెందినదిగా సమాచారం. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడికావాల్సి ఉంది.