తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ సమావేశం పట్ల రాజకీయ విశ్లేషకులు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. 29న కాకినాడలో జరగనున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయో ఎన్నికలకు ఏ నిర్ణయాలు తీసుకోనున్నారనే సందిగ్ధం నెలకొంది. ఈ నేపద్యంలో ఇరుపార్టీల రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల స్థాయి నాయకులు కాకినాడ సాంబమూర్తినగర్లోని విఎస్ఎల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశం కానున్నారు. సీట్ల సర్ధుబాటు విషయంలో రెండు పార్టీలు ఓ ఒప్పందానికి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.