సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి హత్య కేసుకు సంబంధించి ముద్దాయి అదే గ్రామం సాలిపేటకు చెందిన తలాటం రాంబాబు(50) ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీ.ఐ కే. దుర్గా ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం బియ్యం వ్యాపారి అతనికి రావాల్సిన బాకీల వసూలు విషయమై గ్రామంలో ఇంటినుంచి బయటకు వెళ్లగా అదే గ్రామంలో ఉంటూ చెడు వ్యసనాలకు గురైన తలాటం రాంబాబు అనేవ్యక్తి వ్యాపారి తాతాబ్బాయిని అతని ఇంటిలోనికి తీసుకువెళ్ళి రుమాలతో గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం మృతుని ధరించి ఉన్న నాలుగు బంగారు ఉంగరాలను తీసుకున్నాడు. తదుపరి అర్థరాత్రి దాటిన తరువాత మృత దేహాన్ని గ్రామ శివారు లోని బెజవాడ సత్యనారాయణ పొలంలో మట్టిలో పాతిపెట్టాడు. కాగా బియ్యం వ్యాపారి హత్యపై దర్యాఫ్తు చేసి హత్యకు పాల్పడిన రాంబాబును సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఈ హత్య కేసును స్థానిక సీ.ఐ. దుర్గా ప్రసాద్ దర్యాఫ్తు చేస్తున్నారు