కాకినాడ మండలంలో గొడారిగుంట 3వ వార్డ్లో జగనన్న గడప గడప ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్ మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబు కు మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ గజ మాలను సత్కరించారు. తదనంతరం గడప గడప ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కన్నబాబు ఇంటింటికీ వెళ్లి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పధవిలో కి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలకు ఎంత మేలు జరిగిందో వివరించి, మేలు జరిగిన కరపత్రాలను పంపిణీ చేశారు. తదనంతరం మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమార్ పుట్టిన రోజు వెడులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కన్నబాబు, కాకినాడ మాజీ కౌన్సిలర్ మణికూమర్, కమిషనర్ సీ.హెచ్. నాగ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.