కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం వై.సీ.పీ. ఇన్చార్జి దావులూరు దొరబాబు పంపిణీ చేశారు. ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై వైద్య సేవలను అందుకుంటున్న పలువురు సీ.ఎం. సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఉదయం సామర్లకోట పార్టీ కార్యాలయంలో హౌసింగ్ చైర్మన్ దొరబాబు బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.