కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సి.ఐ. రమేష్ మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థి, విద్యార్థినులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి తద్వారా ప్రమాదాలను నియంత్రించగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఎస్.ఐ. కిశోర్ బాబు, ఏ.ఎస్.ఐ. రమణ మూర్తి , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.