ప్రపంచ కప్లో భాగంగా ఈనెల 19న భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ను అభిమానులు పెద్ద స్క్రీన్ల (ఫేన్ ఎరీనా) పై తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏ.సీ.ఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏ.సీ.ఏ కార్యదర్శి శ్రీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచ్ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు. అక్కడ ఫుడ్ కౌంటర్లు ఉంటాయన్నారు. పెద్ద స్క్రీన్లను అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
బిగ్ స్క్రీన్ పై ‘భారత్– ఆస్ట్రేలియా’ ఫైనల్ మ్యాచ్
![images (14)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/images-14.jpeg?resize=729%2C421&ssl=1)