పేరు మోసిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ మీడియాకు
తెలియచేశారు. వారినుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 23.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన అన్నారు.
వీరిలో ఒక దొంగపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు ఉన్నట్లు, మరో దొంగపై 10 కేసులు, మరో దొంగపై 03 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ అన్నారు.