రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. స్థానిక సమస్యలను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 08842357800 కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చనీ ఆయన అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. అలాగే 10:30 నుంచి స్పందన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డయల్ యువర్ కమిషనర్,స్పందన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.