మిచౌంగ్ నుంచి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనిముఖ్యంగా తిరుపతి లో వరద బాధితులు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని తిరుపతి నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. భూమన కరుణాకర రెడ్డి ప్రజలకు సూచించారు. మిచౌంగ్ ప్రభావంతో నీట మునిగున పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను భూమన అధికారులతో వెళ్లి పరామర్శించారు. బాదితులను అధికారుల సమాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను భూమన ఆదేశించిన.