భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను కాకినాడ స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించారు.ఈ కార్యాక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మిఅతిథులుగా విచ్చేశారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ నందు ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా జే.సీ. ఎస్. నుపూర్ అజయ్ లు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ… అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను భావజాలాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రసంగిస్తూ… రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని,విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు,జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి, కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.