మిచౌంగ్ తో పంట పొలాల్లోకి చేరిన నీటిని వీలయినంత త్వరగ తొలగించటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావ అనంతరం తీసుకోబోయే చర్యలుపై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నుండి జిల్లా ప్రతేక అధికారి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ప్రధాన కార్యదర్శి , జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, తదితరులతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డా. కృతికా శుక్లా తుఫాను అనంతర పరిస్థితిని ముఖ్యమంత్రి కి వివరిస్తూ, తుపానుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నందువల్ల ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు. జిల్లాలో ఐదు గ్రామాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. జిల్లా ప్రత్యేక అధికారిఎన్. యువరాజ్ మాట్లాడుతూ… వ్యవసాయ పరంగా జరిగిన నష్టాన్ని గురించి సీంఎం. కి వివరించారు.