మామిడికూదురు మండలంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అందరూ కలిసి తాసిల్దారు గారి ఆఫీసు ఎదుట ధర్నా చేసారు. రైతులు చేస్తున్న ఈ ధర్నాకి మామిడికుదురు మండల జనసేన పార్టీ తరపున, టీ.డీ.పీ. పార్టీ రైతులకు సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన మామిడికుదురు మండలం అధ్యక్షులు జే.ఎస్.ఆర్. పాసర్లపూడి లంక ఎమ్.పీ.టీ.సీ. చెరుకూరి పార్వతీ సత్తిబాబు గారు, పాశర్లపూడి ఉప సర్పంచ్ తుండూరు బుజ్జి, అప్పనాపల్లి సీనియర్ నాయకులు కంకిపాటి నరసింహారావు, తదితరులు పాల్గొని విజయవంతం చేసారు