సామర్లకోట ఆలయాల్లో ఒకటయిన భీమేశ్వ ఆలయాన్ని మంత్రి రోజా సంద్శించారు. మిచౌంగ్ పర్యటనలో భాగంగా రోజా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి రోజా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలలో పర్యటిస్తారు. దానిలో భాగంగానే రోడ్డు మార్గం గుండా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం చేరుకుని భీమేశ్వర స్వామిని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రోడ్డు మార్గం గుండా రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సౌత్, వెస్ట్ జోన్ ల వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ప్రారంభిస్తారు. దానిలో భాగంగానే సామర్లకోట భీమేశ్వర ఆలయం వద్ద జిల్లా ఎస్పీ సూచనల మేరకు పెద్దాపురం డిఎస్పి లతా కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తూ దేవాదాయ అధికారులను, ఉన్నత అధికారులు అప్రమత్తం చేశారు.