గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం రసంత్రంగా సాగుతున్న తరునంలో ఆ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని బడుగు బలహీన వర్గాల ప్రజా నాయకుడు కంచు మూర్తి రాజశేఖర్ బహిరంగా వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనను కృషి చేస్తానని , రాజ్యాంగ సౌరభవాన్ని కాపాడుకుని ప్రజల శ్రేయస్సు కొరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల చెందిన తెలంగాణ ఆడబిడ్డ బర్రె లక్కను ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు.
ఆమె ఓడిపోయిన ఆమె ఓటమిని సైతం స్వాగతిస్తూ నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. బర్రెలక్క ఓటమి రాబోయే రోజుల్లో గెలుపుకు నిదర్శమని. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని ఓటమితోనే అనుకున్న విజయాన్ని సాధించి వచ్చని ఆయన పేర్కొన్నారు.. తెలంగాణ ఆడపడుచు గౌరవ సీతక్కను ప్రతి ఒక్కరు గౌరవించి ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ప్రజలదేనని కొనియాడా.