కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీతోనే ఏ.పీ. లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం సాద్యమని అన్నారు. వారికి ఇచ్చే పించన్ను వై.ఎస్.ఆర్. ప్రభుత్వం 6వేలకు పెంచాలంటూ డిమాండ్ చేశారు.
గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి నుంచి 3వేలు ఇవ్వనుందన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దివ్యాంగులు సమస్యలపై చర్చించకపోవడం అమానుషమన్నారు. దివ్యాంగుల సంఘం నగర అధ్యక్షుడు కర్రి ఆదినారాయణ మాట్లాడుతూ… దివ్యాంగులను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారన్నిరు. వారికి సబ్సిడీ రుణాలు, ఇల్లు, 2016 హక్కుల చట్ట అమలు చేయాలన్నారు.