భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్యా నగర పాలక సంస్థ ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను పరిశీలిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. భరద్వాజ్ మాట్లాడుతూ… ఇన్ఫెక్షన్ లను తగ్గంచడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భయాందోళనలను నివారించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. దేశంలో కొత్తగా కనుగొనబడిన కోవిడ్ -19 వేరియంట్ గురించి ఆందోళనలన పడొద్దని చెప్పారు. వైరాలజీ, పల్మోనాలజీ, కమ్యూనిటీ హెల్త్ నిపుణులతో ఇటీవలి సంప్రదింపులను జరిపినట్టు చెప్పారు. ఏదైనా కొత్త వేరియంట్లను వెంటనే గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ను తీవ్రతరం చేయాలని ఆదేశాన్ని ఇచ్చామని తెలిపారు.