కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో 1, 2 సచివాలయాల వాలంటీర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్న చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేకరు పంచాయతీ కార్యాలయంలో ఈ.వో. నరసింహారావుకు వినతీ పత్రాన్ని అందజేశారు. జాబ్ చార్టులో ఉన్నపనులే కాకుండా అనధికారికంగా ఇంకెన్నో పనులను తమతోనే చేయిన్నారని ఆందోళన వ్యక్తంచేసారు. సచివా లయ సిబ్బంది ఒత్తిళ్లను, పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, అనుకూలమైన సమయాలలో బయోమెట్రిక్కు అనుమతించాలని కోరారు. ప్రభుత్వ సర్వేలను తమతోనే చేయిస్తూ… వేతనాలు పెంచమంటే పెంచడం లేదని వాపోయారు.