అస్సాంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశి ఆయనకు నివాళు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గౌహతిలోని అటల్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గౌహతిలోని అటల్ ఉద్యానవనంలో ఆయన విగ్రహాన్ని నిర్మించే పనిని నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. వాజ్పేయి జీవితం, సాధించిన విజయాలను ప్రదర్శించే అటల్ ఉద్యానవనంలో అటల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని రాష్ట్రానికి, ఈశాన్య రాష్ట్రాలకు చేపట్టిన చర్యలకు అస్సాం ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు.