మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా ఎక్కువ కేసులు నమోదయ్యయని ఆయన అన్నారు. అదనంగా, నాసిక్ నుండి ఒక మరణం నమోదయ్యిందని అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన పి.టి.ఐ.కి. చెప్పారు. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్ర నుండి 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.