అమలాపురంలో హైస్కూల్ ఆవరణలో జరిగిన మానవతా స్వచ్చంద సేవాసమితి 49 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జస్టిస్ ఎన్. బాలయోగి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… గత ఏభై సంవత్సరాలుగా మానవతా స్వచ్చంద సేవాసమితి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక ,సామాజిక సేవారంగాలలో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజి న్యాయ మూర్తి ఎన్. బాలయోగి అన్నారు .
మానవతా సంస్థ తుఫానులు వరదలు అగ్నిప్రమాదాలు మున్నగు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాలలో మానవ సేవయే పరమార్ధంగా భావించి ఇప్పటికి వేలాది సేవాకార్య క్రమాలు చేపట్టారన్నారు. అనాథలను, అభాగ్యులను, నిరుపేదలను ఆపదల్లో ఆదుకొని మహోన్నత సేవలందించడం సర్వదా ప్రశంస నీయమని సంస్థ సుదీర్గ సేవలను బాలయోగి ప్రశంసించారు.