ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభను రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించారు. ఈ మహాసభను రైతులు మున్సిపల్ స్టేడియం నుండి శ్యామల సెంటర్ మీదుగా వెళ్లి డీలక్స్ సెంటర్, విజయ థియేటర్ రోడ్డు, గోదావరి గట్టు మీదుగా రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది రైతులు విచ్చేసి కదం తొక్కారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయంపై గళం విప్పారు. రైతుల ఐక్యత పై హేళన చేస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధపడతామని అన్నారు. రైతుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.