ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ రేమెళ్ళ మల్లికార్జునరావు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బిళ్ళతో ముగ్గులు అక్కడివారిని ఆకాట్టుకున్నాయి.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న మాట్లాడుతూ… సాహిత్య అకాడమీ సాంస్కృతి సంక్రాంతి పండుగను ముందే ఏలూరుకు తెచ్చిందని కొనియాడారు. తదనంతరం అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ… సాహిత్య కళలు, సంస్కృతులే జాతికి గుర్తింపును, ప్రత్యేకతను తీసుకోస్తాయని అన్నారు.