అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని యూనియన్ నాయకులు, సి.ఐ.టి.యు. నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నా 42 వ రోజు కూడా సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కోశాధికారి ఎం. రమణమ్మ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
విజయవాడలో అరెస్టులు జరుగుతున్నా, జిల్లాలో కూడా ఆందోళన సాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. కార్యక్రమానికి సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, సి.ఐ.టి.యు. నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్, తదితర మండలాల అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.