శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్నారు. వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డా. విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్ల బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో ఈ.పి.ఆర్.పి. అందించే ప్రత్యేక విభాగాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వయసు మళ్ళిన వారిలో తరచుగా వచ్చే కీళ్ల సంబంధిత వ్యాధుల వైద్య విధానానికి ఇటువంటి దుష్ప్రభావాలు లేని విధంగా ఈ.పి.ఆర్.పి. ప్లేట్లెట్స్ రీచ్ ప్లాస్మా ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు అందించే దిశగా కృషిచేసిన ఆర్థోపెడిక్ హెచ్ ఓ.డి. డా. పాండురంగ విట్టల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్తూపెడిక్ చీఫ్ డా.పార్థసారథి, డా. ముఖర్జీ, డా.ర్ రామ్ కిషోర్ లు, తదితరులు పాల్గొన్నారు.