ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్టుకూరు గ్రామంలో అక్రమముగా నిల్వ మద్యాన్ని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముత్తుబోయిన రాంబాబు, తండ్రి నరసింహులు అనే వ్యక్తులు నుంచి మన్సంహౌజ్ 144 బాటిల్స్, ఓఏబి 130 బాటిల్స్, 371 నాకౌట్ బీర్లు ను స్వాధీనం చేసుకున్నట్లు సీ.ఐ. శ్రీనివాసరావు తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం లో గల సమ్మక్క సారక్క బ్రాందీ షాపు నందు మద్యం కొనుగోలు చేసి వాటిని అద్దె వాహనంలో వేలేరుపాడు మండలంలో గల మేడిపల్లి గ్రామంలో ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్ మీదుగా పోలీస్ సిబ్బంది ఎవరూ లేని సమయంలో అక్రమంగా తరలించారని తెలిపారు. వాటి విలువ మొత్తం 99440 రూపాయల విలువ చేస్తాయని ఈ విధంగా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తినీ పట్టుకుని కేస్ కటడం జరిగింది అని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.