బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బాలయోగిస్టేడియంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రభుత్వ శాఖల శకటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా, బ్యాడ్మింటన్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్ విచ్చేశారు. తరువాత జాతియ జండాను ఆవిష్కరించి ప్రతిభ కనబరిచిన అధికారులకు మెమెంటోస్, ప్రశంస పత్రాలను కలెక్టర్, మంత్రి విశ్వరూప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ఎస్పి శ్రీకాంత్, కలెక్టర్ హిమాన్షు శుక్ల, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్,ఎంపీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.