ఏలూరు జిల్లాలో రైతు భరోసా శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని డా. కె మోహనరావు ప్రిన్సిపల్ సైంటిస్టు (వెంటమాలజీ), అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయసాయి వారి అధ్యక్షతన స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు పంటల స్థితిగతులను, చీడ పీడల పరిస్థితులను మరియు వివిధ పంటల విస్తీర్ణముల గురించి తెలియజేశారు. డా. కె. మోహన్ రావు జిల్లాలో సాగు చేస్తున్న వివిధ పంటల గురించి తెలియజేశారు.
వేరుశనగలో వచ్చే తెగుళ్లు పురుగుల గురించి వివరించారు. చింతలపూడి సబ్ డివిజన్ వరికి బదులుగా ఆయిల్ పామ్ వైపుకు రైతాంగు మొగ్గుచూపుతున్నారు. కార్యక్రమంలో డా. ఎన్. చాముండేశ్వరి ప్రధాన శాస్త్రవేత్త (జన్యు ప్రకారద శాస్త్రం). విజయరాయి మరియు డా. ఎన్. నాగేంద్ర శాస్త్రవేత్త (మిస్తరణ) ఏరువాక కేంద్రం ఏలూరు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.