కాకినాడ రూరల్ సర్పవరం శెట్టిబలిజ పేటలో యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ వారి CSR నిధులతో ఆర్.ఓ. ప్లాంట్ (త్రాగునీరు) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ మినిస్టర్, కాకినాడ ఎం.పీ. వంగా గీత నిర్మించారు. కానీ సంవత్సరం నుంచి మంచినీళ్ళకి నోచుకోలేదు. దానితో గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సభల్లో అధికార పార్టీ వాళ్లకు, అధికారులకు మోర పెట్టుకున్నారు. కాని ప్రజలకు అధికార పార్టీ చుక్కనీరు అందించడంలో విఫలమయ్యారు.
కానీ వైఎస్ఆర్ పార్టీ పోట పోటీగా వాటర్ ప్లాంట్ గ్రామ సచివాలయం వాటర్ ట్యాంకు పక్క పక్కనే ప్రభుత్వ భవనాలు నిర్మించినా… ప్రజలకు త్రాగునీరు వాటర్ ట్యాంక్ కుళాయిల ద్వారా ప్రొద్దుట సాయంత్రం ఇవ్వకుండా మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా 20 లీటర్లు బాటిల్ ₹5కే ఇస్తామని బోర్డు పెట్టారు. పెద్ద పెద్ద వైయస్సార్ కటౌట్లు పెట్టుకుని డబ్బాలు కొట్టుకుంటూ నిరుపేదలకు కనీసం మంచినీరు అందించలేకపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.