తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, తదితరులు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొండబాబు, చినరాజప్ప మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో టి.డి.పి., జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమ కాబట్టి దానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, మోక ఆనంద్ సాగర్, టీ.డీ.పీ. కార్యకర్తలు విచ్చేశారు.