జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దఫా నిర్వహించే స్నాతకోత్సవానికి జేఎన్టీయూ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్న తరుణంలో క్రమశిక్షణ తో కూడిన కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు .
జెఎన్టియుకె ఛాన్స్లర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా బీటెక్, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఎంటెక్, బి బి ఏ, బి ఆర్క్, విద్యార్థులకు సంబంధించిన డిగ్రీ పట్టాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ ఛాన్స్లర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకటాచలం తోబాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నట్లు జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ జి వి ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు.