ఆంద్ర రాష్ట్ర ప్రజలకు నాణ్యమయిన విద్యుత్ ను సరఫర చేయడమే లక్ష్యంగా సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడించారు. ఇందులో భాగంగానే కాకినాడలోని పరలో పేటలో రూ. 8.15 కోట్లా రూపాయిలతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారన్నారు. నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్ర శేకర్ రెడ్డి విచ్చేసారు.
తొలత శిలాఫలకాన్ని ఆవిష్కరించి సబ్ స్టేషన్ ను ప్రావంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కొత్త సబ్ స్టేషన్ వల్ల స్థానిక గా ఉండే టిడ్కో నివాసాలతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి లో వోల్టేజి సమస్యలేని విద్యుత్ ను అందించగలమన్నారు. బీచ్ రోడ్ లో కూడా త్వరలోనే అధిక సామర్థ్యం కలిగిన మరో సబ్ స్టేషన్ నిర్మాణం కాబోతోందన్నారు. ఈ కార్యక్రమానికి మ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్ర కళా దీప్తి, డి.ఈ. జి. ప్రసాద్, తదితలరులు పాల్గొన్నారు.