ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో YSR మెమోరియల్ 56వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్స్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జరుగుతాయని వెళ్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పురుషుల విభాగంలో 14 సర్వీస్ ఎంప్లాయిస్ టీంతో కలిపి, మహిళల విభాగంలో 13 జిల్లాల జట్లు ఛాంపియన్షిప్ కోసం పోటీ పడనున్నాయి.
వైయస్సార్ మెమోరియల్ పేరిట నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ కు పెద్దాపురం నియోజకవర్గ వై.సీ.పీ. ఇంచార్జ్ దవులూరి దొరబాబు సమక్షంలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం,నెల్లూరు, కడప కర్నూలు, చిత్తూరు అనంతపురం జిల్లాల పురుషుల మరియు మహిళల జట్లు పాల్గొనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖో-ఖో అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగే ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి 60 మంది న్యాయ నిర్ణీతలగా వ్యవహరించనున్నారు.