కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. నాయకులు కొండపల్లి రామకృష్ణ, తోట చిట్టిబాబు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పి. వేమవరం టీ.డీ.పీ. నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పెద్దాపురం ఎమ్మేల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నాయకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొండపల్లి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత వై.సీ.పీ. ప్రభుత్వం పరిపాలన అక్రమంగా మారిందని, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారని, ఎవరు పేదలు, ఎవరు పెత్తందార్లు అనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.