తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగగింది. స్థానిక మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద లారీ ఒక బైకును ఢీ కొట్టింది. దానితో బైకు మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఆంబులెన్స్ వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, మరొక యువకుడు ఆదివారం సాయంత్రం రాజమండ్రి నుండి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అందుతో దుర్గ అనే వ్యక్తి కి ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని తెలిపారు.