కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రఘువీర్ అనే యువకుడు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐ.ఏ.ఆర్.ఐ. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే వినూత్న రైతు అవార్డు-2024 ను సొంతం చేసుకున్నాడు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను కాపాడేందుకు లక్షల జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలి దేశ వ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తనకున్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలో వాటిని నాటి వాటికి రక్షణ కల్పిస్తున్నాడు.
దానిని గుర్తించిన ఐ.ఏ.ఆర్.ఐ. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డు అందుకున్నాడు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2023లో జాతీయ ఉత్తమ రైతు అవార్డులతో పాటు మిజోరం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2022లో ఉత్తమ రైతు అవార్డును సొంతం చేసుకున్నారు. మార్చి 1న న్యూ ఢిల్లీలో జరిగే విజ్ఞాన్ మేళాలో ఐ.ఏ.ఆర్.ఐ. ప్రకటించిన వినూత్న రైతు అవార్డు-2024ను స్వీకరించనున్నట్లు తెలిపారు.