తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిక్షస్తుండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డా. సనత్ కుమారి, జిల్లా ఇమ్మ్యునయి జేషన్ అధికారి డా. ఎన్. రాజ కుమారి, డా. శైలజ, డా.మహీంద్ర, తదితరులు పాల్గొన్నారు.