శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం రోజున పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక ప్రశాంతతని చేకూర్చింద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాయీశ్వర లింగం వద్ద జరిగిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సత్యసాయిబాబా ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న సత్యసాయి సేవాసంస్థ కృషి అనన్య సామాన్యం అని అన్నారు. సత్యసాయి సంస్థల సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చానని అన్నారు.