కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో యు. కత్తపల్లి లో గడపగడప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. వంగా గీత ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రంలో భాగంగా ఆమె ప్రతీ ఇంటిని సందర్శించారు. ఆమెను అందరూ సాదరంగా ఆహ్వానించారు. ప్రతీ ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో కూడిన కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ నే గెలిపించాలని అందరిని కోరారు. ఈ కార్యక్రమంలో వంగా గీతా, వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.