రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామకృష్ణారావు పేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమ్యా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు. హిందు ముస్లిమ్ క్రైస్తవ జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంతో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత భావంగా పరస్పరం ఇనుమడింప జేసుకోవాలన్నారు. రంజాన్ మాసంలో ప్రతివారం సోదర ముస్లింలకు ఇఫ్తార్ విందుగా వారి ఇండ్లకు వెళ్లి స్వయం పాకం అందిస్తామన్నారు.
రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలి… -దూసర్లపూడి రమణ రాజు-
![WhatsApp Image 2024-03-12 at 3.38.42 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-12-at-3.38.42-PM.jpeg?resize=1080%2C645&ssl=1)